‘పరువు’ తీశారు.. తల్లిదండ్రులే కాలాంతకులు కన్నబిడ్డ గొంతు నులిమేశారు | FZ News


కోలారు: కన్నవాళ్లే కాలయముళ్లుగా మారారు. తక్కువ కులానికి చెందిన యువకుడిని ప్రేమించడమే ఆమె చేసిన నేరం. సమాజంలో తమ పరువును కాపాడుకునేందుకు కన్నకూతుర్నే గొంతు నులిమి చంపారు. ఈ సంఘటన కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలూకా తమటంపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. హతురాలిని ప్రియా రెడ్డి(17)గా గుర్తించారు. వివరాల్లోకెళ్తే... ప్రియారెడ్డి అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. 

ఇంట్లో ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారించారు. ఆమె దొంగచాటుగా ప్రియుడిని కలుసుకునేది. శనివారం రాత్రి ఇలానే ఆమెను వారించారు. ఫలితం లేకపోయింది. తమకు తెలియకుండా ప్రియుడితో కలిసి పారిపోతుందనే ఆందోళనతో తండ్రి బైరవరెడ్డి, తల్లి, సోదరుడు కలిసి ఆమెను గొంతునులిమి హతమార్చారని పోలీసులు వివరించారు. సమాచారాన్ని తెలుసుకున్న గౌనిపల్లి పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు.

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top