ప్రాణం తీసిన ల్యాప్‌టాప్‌ | FZ News


దిల్లీ: ఓ యువకుడు ల్యాప్‌టాప్‌ వాడుతుండగా షాక్‌ కొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. గోవింద్‌పురి ప్రాంతానికి చెందిన బ్రిజేశ్‌ సింగ్‌(23) అనే యువకుడు ఛార్జింగ్‌లో ఉన్న ల్యాప్‌టాప్‌లో మెయిల్స్‌ చెక్‌ చేసుకుంటున్నాడు. ఒక్కసారిగా షాక్‌ కొట్టడంతో బ్రిజేశ్‌ స్పృహకోల్పోయాడు. కుటుంబీకులు బ్రిజేశ్‌ని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు ఫోరెన్సిక్‌ టీం సాయంతో సెక్షన్‌174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రిజేశ్‌కి మూడు నెలల క్రితమే వివాహమైంది. వైద్య పరంగా అతని గత చరిత్ర, హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశం... తదితరాలతో పాటు ఇంట్లో విద్యుత్‌ సరఫరాకి సంబంధించి ఏర్పాటుచేసిన ఎర్తింగ్‌ పరిస్థితి, ల్యాప్‌టాప్‌ నాణ్యత.. తదితర పలు కోణాలపై దృష్టిసారించి వారు దర్యాప్తు జరుపుతున్నారు.

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top