కత్తెర వేయించుకున్న సమంత | FZ News

కత్తెర వేయించుకున్న సమంత

ఓ దర్శకుడు స్క్రిప్టులో రాసుకుని, తనకు నచ్చి తీసే ప్రతి సన్నివేశమూ బాగుందనే అనుకుంటాడు. తాను రాసి తీసిన ఏ సన్నివేశాలకు కత్తెర వేయడానికి పెద్దగా ఇష్టపడడు. కొందరు ఎడిటింగ్ టేబుల్ దగ్గర అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకుని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకొందరు మాత్రం తీసిన ప్రతి సన్నివేశాన్నీ అలాగే ఉంచేస్తారు. ఐతే విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి కొన్ని పర్టికులర్ సన్నివేశాల మీద ఎక్కువ వ్యతిరేకత వస్తే మాత్రం కత్తెరకు పని చెప్పేస్తన్నారు మన ఫిలిం మేకర్స్.

ఈ మధ్య ఇలాంటి పోస్ట్ రిలీజ్ ట్రిమ్మింగ్స్ టాలీవుడ్లో మామూలైపోయాయి. గత నెల ఆరంభంలో ‘24’ సినిమాలో సెకండాఫ్ సన్నివేశాలు కొన్నింటిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రొమాంటిక్ ట్రాక్‌లో సాగతీత ఎక్కువైందని ఏకాభిప్రాయం వ్యక్తమవడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండో రోజే ఆ సన్నివేశాల్ని ట్రిమ్ చేసేశారు. తర్వాత ‘బ్రహ్మోత్సవం’ విషయంలోనూ ఇలాగే చేశారు. లెంగ్త్, బోరింగ్ సీన్స్ గురించి చాలా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో దాదాపు 18 నిమిషాల దాకా కోత పెట్టేశారు.

‘24’ సినిమాకు ట్రిమ్మింగ్ కలిసి రాగా.. ‘బ్రహ్మోత్సవం’లో  కోతల వల్ల పెద్దగా ప్రయోజనం దక్కలేదు. దానికి ఆ స్థాయిలో నెగెటివిటీ ఉంది మరి. అంటే సినిమాకు పాజిటివ్ టాక్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రిమ్మింగ్ కలిసొస్తుంది. అందుకే ‘అఆ’ టీమ్ కూడా అప్రమత్తమైంది. ఈ సినిమాలోనూ ద్వితీయార్దంలో కొన్ని సన్నివేశాలకు సంబంధించి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. సాగతీత ఎక్కువైందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రేక్షకుల మనోభావాల్ని త్రివిక్రమ్ అండ్ కో మన్నిస్తూ.. ద్వితీయార్ధంలో 5 నిమిషాల వరకు ట్రిమ్ చేసింది. విశేషం ఏంటంటే.. ఇక్కడ కత్తెర వేయించుకున్న మూడు సినిమాల్లోనూ సమంతే కథానాయిక. ఆమెతో ముడిపడ్డ సన్నివేశాల మీదే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.


Source: gulte.com

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top