త‌న‌వంతు సాయం చేసిన యాంక‌ర్ ర‌ష్మీ | FZ News

      

     ప్ర‌ముఖ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్‌కి సామాజిక స్పృహ ఎక్కువ‌నే చెప్పాలి. స‌మాజంలే జ‌రిగే మంచు చెడుల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా మాట్లాడే ర‌ష్మీ కొద్ది రోజులుగా జ‌నాల‌లో క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ ప‌లు ట్వీట్స్ చేస్తూ వ‌స్తుంది. తాజాగా ఆమె 25 వేల రుపాయలను PMcares కు విరాళంగా ఇస్తున్న‌ట్టు ట్వీట్ చేసింది. క‌ష్ట స‌మ‌యంలో  ప్రధాన మంత్రి సహాయనిధికి తన వంతుగా విరాళం ఇచ్చానని , మీరు కూడా  మీవంతుగా  అంతో ఇంతో సాయం చేయాలని కోరింది. విప‌త్తు స‌మ‌యంలో తామున్నామ‌నే భ‌రోస్తా ఇస్తున్న సినీ సెల‌బ్రిటీలు సీఎం స‌హాయ‌నిధితో పాటు సిసిసికి కూడా భారీగా విరాళాలు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.   

త‌న‌వంతు సాయం చేసిన యాంక‌ర్ ర‌ష్మీ



© నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top