ఏపీలో హై అలర్ట్.. ఈ రోజే కొత్తగా 17 కేసులు.. | FZ News




         ఏపీలో కరోనా కేసులు ఒక్కసారిగా 40కి చేరాయి. ఈ ఒక్క రోజే 17 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.


ఆ 17 మందిలో చాలా మంది ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే.






17 మందిలో ఎనిమిది మంది ప్రకాశం జిల్లా, అనంతపురానికి చెందిన వారు ఇద్దరు, ఐదుగురు గుంటూరు, ఒకరు కృష్ణా జిల్లా వాసి కాగా మరొకరు తూర్పు గోదావరికి చెందిన వారు ఉన్నారు.
ప్రకాశం జిల్లా కేసుల్లో ఐదుగురు చీరాలకు చెందిన వారే కావడం గమనార్హం.
నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం వరకు 164 మందిని పరీక్షించగా 147 మందికి నెగటివ్ వచ్చిందని, మిగతా వారికి పాజిటివ్ వచ్చిందని ఏపీ ప్రభుత్వం మెడికల్ బులిటెన్ విడుదల చేసింది.

© News18 తెలుగు ద్వారా అందించబడింది

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top