దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి 24 గంటల్లో 9000 కేసులు | FZ News

న్యూఢిల్లీ: దేశంలో వరుసగా నాలుగో రోజు కూడా 8 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

మంగళవారం నుంచి బుధవారం వరకు 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,909 వైరస్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 217 మరణాలు సంభవించడంతో మృతుల సంఖ్య 5,815కు పెరిగినట్లు పేర్కొంది. కాగా, బుధవారం నాటికి వైరస్‌ కేసుల మొత్తం సంఖ్య 2,07,615కు చేరినట్లు తెలిపింది. ఇందులో 1,01,497 మంది చికిత్స పొందుతుండగా 1,00,302 మంది కోలుకున్నట్లు చెప్పింది. మొత్తం పాజిటివ్‌ కేసులతో పోల్చితే 48.31 శాతం మంది కోలుకున్నట్లు వెల్లడించింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో భారత్‌ ఏడో స్థానంలో కొనసాగుతున్నది. 

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి 24 గంటల్లో 9000 కేసులు

15 నుంచి రోజుకు 15 వేల కేసులు 
భారత్‌లో ఈ నెల 15 నుంచి రోజూ 15 వేలకుపైగా కేసులు నమోదు కావచ్చని చైనా పరిశోధకులు పేర్కొన్నారు. గన్సు ప్రావిన్స్‌లోని లాన్జౌ యూనివర్సిటీ బృందం ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో రోజువారీ కరోనా కేసుల నమోదు అంచనా వ్యవస్థను రూపొందించింది. దీని ప్రకారం భారత్‌లో ఈ నెల 2 నుంచి రోజుకు 9,291 పాజిటివ్‌ కేసుల వరకూ నమోదవుతాయని అంచనా వేసింది. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్న 8,909 సంఖ్యకు ఈ అంచనా దగ్గరగా ఉండటం గమనార్హం. అలాగే మే 28 నుంచి 24 గంటల్లో 7,607 వైరస్‌ కేసులు నమోదవుతాయని అంచనా వేయగా, కేంద్రం శుక్రవారం వెల్లడించిన 7,467 సంఖ్యకు ఇది చాలా దగ్గరగా ఉన్నది. 

© నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది

Post a Comment

 
FZ News © 2021. All Rights Reserved. Powered by FZ News
Top